బెంగుళూరులోనే ఐపీఎల్ మ్యాచులు : డీకే

by Muthe.Rajitha |

ఐపీఎల్ మ్యాచులు చిన్నస్వామి స్టేడియంలోని జరుగుతాయని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేసారు.

బెంగుళూరులోనే ఐపీఎల్ మ్యాచులు : డీకే
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ మ్యాచులు చిన్నస్వామి స్టేడియంలోని జరుగుతాయని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేసారు. ఈ మ్యాచులు తమ రాష్ట్ర గౌరవ మర్యాదలకు సూచిక అని, ఎట్టి పరిస్థితుల్లోనూ కర్ణాటకలోని మ్యాచులు జరగాలని అన్నారు. RCB విక్టరీ పరేడ్ తొక్కిసలాట దృష్ట్యా మరింత భద్రత ఏర్పాటు చేస్తామని, అత్యాధునిక సౌకర్యాలతో మరో కొత్త స్టేడియాన్ని కూడా నిర్మిస్తామని పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది RCB విజయోత్సవ ర్యాలీలో 11 మంది చనిపోగా.. చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన మ్యాచులను మహారాష్ట్రలోని పూణే స్టేడియానికి తరలించేందుకు RCB యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కర్ణాటక RCB ఫ్యాన్స్ DK ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story