IPL 2025: యుద్ధం ఆగింది.. ఇక ఆ 3 వేదికల్లోనే ఐపీఎల్ 2025 !

by Veldandi saikiran |   ( Updated:2025-05-11 12:11:28.0  )
IPL 2025: యుద్ధం ఆగింది.. ఇక ఆ 3 వేదికల్లోనే ఐపీఎల్ 2025 !
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ( IPL 2025) నిరవధికంగా వాయిదా పడింది. మొన్న గురువారం నుంచి యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో వాయిదా వేశారు. అయితే కాసేపటి క్రితమే ఇండియా ( India), పాకిస్తాన్ లు ( Pakisthan) కాల్పుల విరమణకు అంగీకారం తెలిపాయి. అగ్రరాజ్యం అమెరికా ( America) మధ్యవర్తిత్వం చేయడంతో... రెండు దేశాల మధ్య కాల్పులు ఆగిపోయాయి. మే 12వ తేదీన మరోసారి రెండు దేశాల మధ్య చర్చలు జరగబోతున్నాయి. అంటే దాదాపు యుద్ధం ఆగిపోయినట్లే.

ఇలాంటి నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్.. ఎప్పుడు ప్రారంభమవుతుందని దానిపైన చర్చ జరుగుతోంది. నేషనల్ మీడియా కథనాల ప్రకారం వచ్చేవారం ఈ టోర్నమెంట్ ప్రారంభం కాబోతుందని చెబుతున్నారు. అయితే.. దీనికోసం ప్రత్యేకంగా మరోసారి షెడ్యూల్ రిలీజ్ చేస్తారని చెబుతున్నారు. అలాగే ఉత్తర భారత దేశంలో కాకుండా కేవలం దక్షిణ భారతదేశంలోనే మిగిలిన టోర్నమెంట్ నిర్వహించాలని అనుకుంటున్నారు.

ఈ టోర్నమెంట్ లో మరో పదహారు మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాబట్టి ఆ 16 మ్యాచ్ లను హైదరాబాద్ ( Hyderabad), ముంబై అలాగే చెన్నై వేదికలలో నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు.. రేపు అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed