మనాలీ నుంచి లేహ్ వరకూ రన్నింగ్.. సూఫియా గిన్నిస్ రికార్డు

by Phanindra |

మనాలీ నుంచి లేహ్ వరకూ రన్నింగ్ చేసిన భారత మారథానర్ సూఫియా గిన్నిస్ రికార్డు నెలకొల్పింది.

మనాలీ నుంచి లేహ్ వరకూ రన్నింగ్.. సూఫియా గిన్నిస్ రికార్డు
X

దిశ, స్పోర్ట్స్: భారత అల్ట్రా మారథనర్ సూఫియా సూఫీ అరుదైన ఘనత సాధించింది. మనాలీ నుంచి లేహ్ వరకు 480 కిలోమీటర్ల దూరాన్ని అత్యంత వేగంగా పూర్తిచేసిన మహిళా రన్నర్‌గా చరిత్ర సృష్టించింది. కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్న ఆమె.. తన ప్రయాణాన్ని 98 గంటల 27 నిమిషాల్లో పూర్తిచేసింది. ఈ రేస్‌ను 100 గంటల్లో పూర్తిచేయాలని ఆమె లక్ష్యంగా పెట్టుకోగా.. అంతకన్నా తక్కువ సమయంలోనే పూర్తిచేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. ఈ రేసు 2023లోనే పూర్తి చేసినా.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ ఇటీవలే ఆమెకు దక్కింది.

Next Story