ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో Siraj, Shubman Gill..

by Disha Web Desk 13 |
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో Siraj, Shubman Gill..
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్, టీమిండియా ప్రధాన బౌలర్ మహ్మద్ సిరాజ్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్(జనవరి) అవార్డు ఐసీసీ నామినేట్ చేసింది. వీరిద్దరూ ఈ మధ్య కాలంలో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇద్దరూ గత జనవరి నెలలో అద్భుతంగా రాణించారు. శుభ్‌మల్ గిల్ అద్భతంగా రాణిస్తున్నాడు. మొదట శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అతడు 70, 21, 116 రన్స్ చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలోనే డబుల్ సెంచరీ చేశాడు. కేవలం 149 బాల్స్‌లోనే 208 రన్స్ చేయడం విశేషం. అదే సిరీస్‌లో తర్వాతి రెండు వన్డేల్లో 40, 112 స్కోర్లు చేశాడు.

మరోవైపు మహ్మద్ సిరాజ్ క్రమంగా టీమిండియాలో ప్రధాన బౌలర్‌గా ఉన్నాడు. బుమ్రా లేని లోటును అతడు తీరుస్తున్నాడు. వన్డేల్లో ఇప్పటికే నంబర్ వన్ ర్యాంకు కూడా అందుకున్నాడు. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో సిరాజ్ మొత్తం 9 వికెట్లు తీయగా.. ఆ తర్వాత తన హోమ్ గ్రౌండ్ హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్లు తీసుకున్నాడు.



Next Story

Most Viewed