సౌతాఫ్రికాపై భారత్ మహిళా జట్టు గ్రాండ్ విక్టరీ

by velandi.Saikiran |   (  Updated:2025-04-29 12:28:26  IST  )

ముక్కోణపు సిరీస్ లో టీమిండియా మహిళల జట్టు అరుదైన విజయాన్ని నమోదు చేసుకుంది. సౌత్ ఆఫ్రికా మహిళల జట్టుపై

సౌతాఫ్రికాపై భారత్ మహిళా జట్టు గ్రాండ్ విక్టరీ
X

దిశ, వెబ్ డెస్క్ : ముక్కోణపు సిరీస్ లో టీమిండియా ( Team india ) మహిళల జట్టు అరుదైన విజయాన్ని నమోదు చేసుకుంది. సౌత్ ఆఫ్రికా మహిళల జట్టుపై ఏకంగా 15 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా మహిళల టీమ్. శ్రీలంక ఉమెన్స్ ముక్కోణపు సిరీస్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య రెండవ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ( Premadasa Stadium, Colombo ) నిర్వహించారు.

అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా... ఏకంగా 15 పరుగుల తేటతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 276 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్ కు దిగిన.. సౌత్ ఆఫ్రికా మహిళల జట్టు (South Africa Women) 49.2 ఓవర్లలోనే 251 పరుగులు చేసి, ఆలౌట్ అయింది. దీంతో ఈ టోర్నమెంట్లో టీమిండియా... భారీ విజయాన్ని భారీ విజయాన్ని చేసుకుంది.

Next Story