IND vs PAK: ఇండియా-పాక్ మ్యాచ్.. వర్షంతో ఆగిన మ్యాచ్‌

by Disha Web Desk 13 |
IND vs PAK: ఇండియా-పాక్ మ్యాచ్.. వర్షంతో ఆగిన మ్యాచ్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌ సూపర్‌-4 మ్యాచ్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వరుణుడు మళ్లీ వచ్చేశాడు. పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపివేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పాక్‌ స్కోరు 44/2. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత బ్యాటర్లు అదరగొట్టారు. విరాట్ కోహ్లీ (122*), కేఎల్ రాహుల్ (111*) సెంచరీలు సాధించారు. మూడో వికెట్‌కు ఆసియా కప్‌లోనే అత్యధికంగా 233 పరుగులు జోడించారు. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 356/2 స్కోరు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (56), శుభ్‌మన్‌ గిల్ (58) హాఫ్ సెంచరీలు చేశారు. పాక్‌పై భారత్‌కు ఇది అత్యుత్తమ స్కోరు కావడం విశేషం.

Next Story

Most Viewed