అతడు జట్టులో పర్మినెంట్ ప్లేయర్ : సౌరవ్ గంగూలీ

by Disha Web Desk 13 |
అతడు జట్టులో పర్మినెంట్ ప్లేయర్ : సౌరవ్ గంగూలీ
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌పై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. శుభ్‌మన్ గిల్ జట్టులో పర్మనెంట్ ప్లేయర్‌గా మారిపోయాడని అన్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్‌లో టీమ్ ఇండియా విజయం సాధింస్తుందని అభిప్రాయపడ్డాడు. విదేశాల్లో అశ్విన్, జడేజా, అక్షర్‌లను ఆడించడం కుదరదు కానీ.. వాళ్లది చాలా గుడ్ కాంబినేషన్ అని అన్నాడు. టీమ్ వైస్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్.. ఫామ్‌లో లేకపోవడంతో జట్టులో చోటు కొల్పోయిన విషయం తెలిసిందే.

అయితే అతని స్థానంలో మూడు ఫార్మాట్లలోనూ శుభ్‌మన్ గిల్ రాణిస్తున్నాడు. ప్రస్తుతం గిల్ లేని టీమిండియాను ఊహించుకోలేం. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులోనూ గిల్ సెంచరీ చేశాడు. దీంతో అతనిపై గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు.



Next Story

Most Viewed