ఛెత్రీ హ్యాట్రిక్.. 4-0 తేడాతో పాకిస్థాన్‌ పై భారత్ ఘన విజయం

by Disha Web Desk 12 |
ఛెత్రీ హ్యాట్రిక్.. 4-0 తేడాతో పాకిస్థాన్‌ పై భారత్ ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: 2023 SAFF ఛాంపియన్‌షిప్‌ ఫుట్ బాల్ మ్యాచులో ఘనంగా ప్రారంభం అయ్యాయి. మొదటి మ్యాచ్‌లోనే భారత చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ తో బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో బుధవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ భారత్ పాకిస్తాన్ పై 4-0 తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి 10, 16, 74వ నిమిషాల్లో గోల్స్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. అలాగే 81వ నిమిషంలో ఉదంత కుమమ్ భారత్‌కు నాలుగో గోల్‌ చేశాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఇరు దేశాల మధ్య ఇదే తొలి మ్యాచ్‌.



Next Story

Most Viewed