- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
శాఫ్ ఫుట్బాల్ చాంపియన్షిప్కు భారత్ ఆతిథ్యం..
by Disha Web Desk 13 |
X
బెంగళూరు: సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్(శాఫ్) చాంపియన్షిప్కు ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వనుంది. బెంగళూరు వేదికగా జూన్ 21 నుంచి జూలై 3వ తేదీ వరకు టోర్నీ జరుగుతుంది. ఈ విషయాన్ని ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్ఎఫ్) ప్రెసిడెంట్ కళ్యాణ్ చూబే వెల్లడించారు. శాఫ్ చాంపియన్షిప్కు భారత్ ఆతిథ్యమివ్వడం ఇది నాలుగోసారి. చివరిసారిగా 2015లో తిరువనంతపురం వేదికైంది.
అలాగే, శాఫ్ చాంపియన్షిప్లో భారత్కు తిరుగులేని రికార్డు ఉన్నది. 12 ఎడిషన్లలో 8 సార్లు విజేతగా నిలిచింది. 2021లో జరిగిన చివరి ఎడిషన్లో టైటిల్ సాధించిన భారత్.. ఈ ఎడిషన్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగబోతున్నది.
Next Story