IND vs PAK: వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా..

by Disha Web Desk 13 |
IND vs PAK: వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ 2023 టోర్నీలో సూపర్ 4 రౌండ్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియాకి శుభారంభం దక్కింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 15 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 115 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కి అనుకూలిస్తున్న పిచ్‌పై భారత ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం అందించారు. షాహీన్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో, ఆ తర్వాత ఐదో ఓవర్‌లో మూడేసి ఫోర్లు బాదాడు శుబ్‌మన్ గిల్. గత మ్యాచ్‌లో పాక్ పేసర్లను ఎదుర్కోవడానికి తెగ ఇబ్బందిపడిన శుబ్‌మన్ గిల్, నేటి మ్యాచ్‌లో కౌంటర్ అటాక్ చేశాడు. శుబ్‌మన్ గిల్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 38 బంతుల్లో 28 పరుగులే చేసిన రోహిత్ శర్మ, షాదబ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో 6, 6, 4 బాది 19 పరుగులు రాబట్టాడు.

ఆ తర్వాత షాదబ్ ఖాన్ ఖాన్ ఓవర్‌లో 6, 4 బాది 43 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. తొలి వికెట్‌కి 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది టీమిండియా. 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేసిన రోహిత్ శర్మ, షాదబ్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి పహీం ఆష్రఫ్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.. ఆ తర్వాతి ఓవర్‌లో శుబ్‌మన్ గిల్ కూడా పెవిలియన్ చేరాడు. 52 బంతుల్లో 10 ఫోర్లతో 58 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో అఘా సల్మాన్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 121/0 స్కోరుతో ఉన్న భారత జట్టు, వెంటవెంటనే 2 వికెట్లు కోల్పోయి 123/2 స్థితికి చేరుకుంది. కేఎల్ రాహుల్ (1), కోహ్లీ (2) పరుగులతో ఉన్నారు.

Next Story