అతని కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది : పంత్‌పై ఏబీడీ కామెంట్స్

by Dishanational3 |
అతని కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది : పంత్‌పై ఏబీడీ కామెంట్స్
X

దిశ, స్పోర్ట్స్ : 2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమ్ ఇండియా వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ దాదాపు 14 నెలల తర్వాత మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. తాజాగా పంత్‌ రీఎంట్రీపై సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు. పంత్ రీఎంట్రీ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోందన్నాడు. ‘ఢిల్లీ కుర్రాడి కోసం భారత్‌తోపాటు ప్రపంచంలోని కొన్ని వేల మంది ఎదురుచూస్తున్నారు. అందులో నేను కూడా ఉన్నా. అతని జెర్సీ నంబర్ 17. నేను కూడా 17 జెర్సీ నంబర్‌ను ఉపయోగించా. మా మధ్య ఈ అనుబంధం ఉంది. పంత్ ఆడటాన్ని చూడటం ఇష్టపడతా. అతడు పునరాగమనం చేయడం సంతోషంగా ఉంది. ఐపీఎల్‌లో పంత్ ఇప్పటికే ఓ సెంచరీ సాధించాడు. ఈ సీజన్‌లో ఆ సంఖ్యను మూడు నుంచి నాలుగుకు పెంచుతాడు.’ అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.


Next Story