‘ది హండ్రెడ్’ టోర్నీలో హర్మన్‌ప్రీత్, స్మృతి..

by Disha Web Desk 13 |
‘ది హండ్రెడ్’ టోర్నీలో హర్మన్‌ప్రీత్, స్మృతి..
X

లండన్: ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ లీగ్ 'ది హండ్రెడ్-2023' టోర్నమెంట్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన భాగం కానున్నారు. శుక్రవారం లీగ్ నిర్వాహకులు ప్లేయర్స్ డ్రాఫ్ట్ విడుదల చేశారు. లీగ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ ట్రెంట్ రాకెట్స్‌కు ప్రాతినిధ్యం వహించబోతున్నది. అరంగేట్ర సీజన్ 2021లో ఆమె మాంచెస్టర్ ఒర్జినల్స్ తరఫున ఆడగా.. గాయం కారణంగా లీగ్ మధ్యలోనే స్వదేశానికి వచ్చింది.

2022లో హర్మన్‌ప్రీత్ లీగ్‌లో ఆడలేదు. ఈ సారి ఆమెను ట్రెంట్ రాకెట్స్ రూ. 25.78 లక్షలకు కొనుగోలు చేసింది. అదే మొత్తానికి స్మృతి మంధానను సదరన్ బ్రేవ్ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. 2021 నుంచి సదరన్ బ్రేవ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న స్మృతి ఈ సీజన్‌లోనూ అదే జట్టుకు ఆడబోతున్నది. ఈ సీజన్‌లో భారత్ నుంచి వీరిద్దరూ మాత్రమే ఈ లీగ్‌లో ఆడబోతున్నారు. ఆగస్టు 1 నుంచి ది హండ్రెడ్ లీగ్ ప్రారంభకానుంది.

Next Story

Most Viewed