Padma Award: టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్‌ అశ్విన్‌కు అవార్డు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-25 17:04:49  IST  )

టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్‌ అశ్విన్‌కు పద్మ అవార్డు దక్కింది..

Padma Award: టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్‌ అశ్విన్‌కు అవార్డు
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్‌ అశ్విన్ (Ravichandran Ashwin)కు పద్మ అవార్డు(Padma Award) దక్కింది. క్రికెట్‌(Cricket)లో ఆయన చేసిన సేవలకు కేంద్రప్రభుత్వం(Central Government) గుర్తించింది. ఈ మేరకు పద్మశ్రీ(Padmasri) అవార్డు ప్రకటించింది. తమిళనాడు(Tamilanadu)కు చెందిన అశ్విన్..స్పిన్నర్‌గా, ఆల్ రౌండర్‌గా క్రికెట్‌లో రాణించారు. అంతర్జాతీయ మ్యాచుల్లో తన చేతి వాటంతో కీలక సమయంలో జట్టును విజయతీరాలకు చేర్చారు. అతివేగంగా 150 వికెట్లు తీసిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఐపీఎల్‌తో పాటు టెస్టుల్లోనూ తన సత్తా ఏంటో చాటారు. 102 వన్డేలు, 32 టెస్టులు, 32 టీ20 మ్యాచ్‌లు ఆడారు. టెస్టుల్లో రెండు సార్లు సెంచరీలు, 6 సార్లు హాఫ్ సెంచరీలు, వన్డేల్లో ఒక హాఫ్ సెంచరీ చేశారు. తన కెరీర్‌లో అత్యధికంగా 124 పరుగులు చేశారు. బౌలింగ్‌లో టెస్టుల్లో 176, వన్డేల్లో 142, టీ20ల్లో 35 వికెట్లు తీశారు. టెస్టుల్లో 16సార్లు ఐదు వికెట్లు పడగొట్టారు. టెస్టుల్లో ఒకే మ్యాచ్‌లో (రెండు ఇన్నింగ్స్) 10 వికెట్లు 4 సార్లు తీశారు.

Next Story