ఢిల్లీ టెస్టుకు శ్రేయస్ అయ్యర్ ఫిట్.. బీసీసీఐ ప్రకటన

by Disha Web Desk 13 |
ఢిల్లీ టెస్టుకు శ్రేయస్ అయ్యర్ ఫిట్.. బీసీసీఐ ప్రకటన
X

న్యూఢిల్లీ: టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వెన్నునొప్పి నుంచి కోలుకున్నాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు వెన్ను నొప్పితో అయ్యర్ సిరీస్‌ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. టెస్టు జట్టులో భాగమైన అతను గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టుకు కూడా దూరమయ్యాడు. తాజాగా అతను గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఈ విషయాన్ని బీసీసీఐ మంగళవారం వెల్లడించింది. అలాగే, న్యూఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని తెలిపింది.

దీంతో నేడో రేపో అతను జట్టుతో కలిసే అవకాశం ఉంది. కాగా, కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ రాకతో టీమిండియా మిడిలార్డర్ బలంగా మారనుంది. అయ్యర్ జట్టులోకి రావడంతో రెండో టెస్టులో సూర్యకుమార్ యాదవ్ బెంచ్‌కే పరిమితమమయ్యే అవకాశం ఉంది. ఈ నెల 17 నుంచి 21 తేదీల మధ్య అరుణ్ జైట్లీ స్టేడియం లో రెండో టెస్టు జరగనుంది.

Next Story

Most Viewed