- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్తాన్పై 39 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన England ప్లేయర్
ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యరీ బ్రూక్ సరికొత్త రికార్డు సృష్టించాడు.

దిశ, వెబ్డెస్క్: ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యరీ బ్రూక్ సరికొత్త రికార్డు సృష్టించాడు. పాకిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడు టెస్టు సిరీస్లో 3-0 తేడాతో ఇంగ్లాండ్ దక్కించుకుంది. ఈ సిరీస్లో అద్భతంగా ఆకట్టుకున్న హ్యరీ బ్రూక్.. మూడు టెస్టు మ్యాచ్ల్లో కలిపి 468 పరుగులతో రాణించాడు. దాంతో పాకిస్తాన్పై మూడు టెస్టు మ్యాచ్ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా సరికొత్త రికార్డు సృష్టించాడు. హ్యారీ బ్రూక్ 3 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీలతో 468 పరుగులు చేసి.. 39 ఏళ్ల రికార్డు కూడా బ్రేక్ చేశాడు. అంతకు ముందు పాకిస్తాన్పై ఈ జాబితాలో అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లాండ్ ఆటగాడు డేవిడ్ గోవర్ మూడు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో 449 పరుగులు చేశాడు. 1984లో డేవిడ్ గోవర్ ఇది సాధించగా.. తాజాగా హ్యారీ బ్రూక్ మూడు మ్యాచ్ల్లో కలిపి 468 పరుగులు చేసి తన రికార్డును కూడా బ్రేక్ చేశాడు.






