ENG vs IND : ఇగ్లాండ్ ఆల్ ఔట్.. ఎవరు ఆధిక్యం అంటే?

by Muthe.Rajitha |   (  Updated:2025-06-22 15:13:41  IST  )

ఐదు టెస్టుల సిరీస్(Test Series) లో భాగంగా ఇంగ్లండ్-భారత్(ENG vs IND) మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ఆల్ ఔట్ అయింది.

ENG vs IND : ఇగ్లాండ్ ఆల్ ఔట్.. ఎవరు ఆధిక్యం అంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ఐదు టెస్టుల సిరీస్(Test Series) లో భాగంగా ఇంగ్లండ్-భారత్(ENG vs IND) మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ఆల్ ఔట్ అయింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ 471 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్ 465 పరుగులకు ఆల్ ఔట్ అయింది. దీంతో భారత్ 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. మూడోరోజు 209/3తో ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్(Harry Bruk) తృటిలో సెంచరీ మిస్(99) అయ్యాడు. పోప్ సెంచరీ(106) సాధించాడు. భారత బౌలర్లలో బుమ్రా(Bumra) 5 వికెట్లు తీయగా.. ప్రసిద్ద్ 3, సిరాజ్ 2 వికెట్లు తీశారు.

Next Story