ధోనీ గర్వపడతారు.. పంత్ పై కార్తీక్ ప్రసంశలు

by Disha Web Desk 12 |
ధోనీ గర్వపడతారు.. పంత్ పై కార్తీక్ ప్రసంశలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ రిషబ్ పంత్ పై ప్రసంశలు కురిపించాడు. భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న చటోగ్రామ్ టెస్టులో 4వ రోజు నూరుల్ హసన్‌ను సంతో స్టంప్ అవుట్ చేశాడు. ఆ సమయంలో పంత్ అచ్చం ధోనీలా అవుట్ చేశాడు. దీనిపై స్పందించిన కార్తీక్.. నిన్ను చూస్తే ధోని గర్వపడతాడని అన్నాడు. "పంత్ బ్యాట్‌ను మిస్ అయ్యే బంతికి సిద్ధంగా ఉన్నాడు...అందుకే ఇది చాలా వేగంగా జరిగింది" అని కార్తీక్ తన ట్వీట్ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి : పూజారాకు ఐపీఎల్‌లో ఆడేందుకు ఆసక్తి లేదు: టీమిండియా ప్లేయర్

Next Story

Most Viewed