ఆలిండియా పోలీస్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సీఆర్‌పీఎఫ్‌కు స్వర్ణం..

by Disha Web Desk 13 |
ఆలిండియా పోలీస్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సీఆర్‌పీఎఫ్‌కు స్వర్ణం..
X

ఛండీగఢ్: ఆలిండియా పోలీస్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) అద్భుత ప్రతిభ కనబరిచింది. టీమ్ ఈవెంట్‌లో సీఆర్‌పీఎఫ్ అగ్రస్థానంలో నిలిచింది. ఫైనల్ పోరులో మిజోరం జట్టును సీఆర్‌పీఎఫ్ చిత్తు చేసింది. కాగా, మణిపూర్ జట్టు కాంస్య పతకంతో సంతృప్తి చెందింది. ఈ టోర్నీ ఆద్యంతం ఈ మూడు జట్లు ఆధిపత్యం ప్రద్యర్శించాయి. కానీ, సీఆర్‌పీఎఫ్ 17 పతకాలతో అగ్రస్థానంలో నిలవగా.. మిజోరం కు చెందిన జట్టు 10 పాయిట్లతో రెండో స్థానంలో నిలిచింది.

మణిపూర్ 5 పతకాలతో మూడో స్థానాన్ని సంపాదించింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన అంకిత్ కుమార్ సహచర ప్లేయర్ నిఖిల్.కెను చిత్తు చేశాడు. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో సీఆర్‌పీఎఫ్ జోడీ ఆయుష్ గౌతమ్, సంగీత్ ప్రత్యర్థి జంట అంకిత్ కుమార్, నిఖిల్‌ను ఓడించి పోడియం చేరుకుంది. ఛండీగఢ్ పోలీసులు నిర్వహించిన ఈ టోర్నీలో దాదాపు 500 మందికి పైగా ప్లేయర్స్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed