క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రెండో టీ20లో భుమ్రాకి చోటు..?

by Disha Web Desk 12 |
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రెండో టీ20లో భుమ్రాకి చోటు..?
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ వేదికగా ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సీరిస్ జరుగుతుంది. ఈ సిరీస్ లో భారత్ మొదటి టీ20లో 208 పరుగుల భారీ స్కోరు చేసి కూడా దానిని కాపాడుకోలేక పోయింది. భారత బౌలర్లు ఎవరు పొదుపుగా బౌలింగ్ వేయకపోవడంతో భారీ స్కోర్ ను సమర్పించుకున్నారు.. ముఖ్యంగా భువనేశ్వర్.. హర్షత్ పటేల్ కేవలం 8 ఓవర్లలో 100 పైగా పరుగులు ఇచ్చారు. దీంతో టీ20లలో జస్ప్రీత్ బుమ్రా లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపించింది.

గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరం అయిన భుమ్రను టీ20 వరల్డ్ కప్ వరకు విశ్రాంతి ఇవ్వాలని అధికారులు అనుకున్నప్పటికీ ప్రస్తుతం అతని సేవలు అవసరం పడ్డాయి. దీంతో అతనికి కూడా ప్రాక్టీస్ అవుతుంది అనే కోణంలో బుమ్రాను నాగ్‌పూర్‌లో జరిగిగే రెండో టీ20కి టీమ్ లోకి తీసుకుని ఆడించే అవకాశం ఉంది. దీంతో భారత బౌలింగ్ దృఢంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది.

ఆస్ట్రేలియా T20 భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), KL రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (WK), దినేష్ కార్తీక్ (WK), హార్దిక్ పాండ్యా, R. అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ , అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్

Also Read:ఇంగ్లాండ్‌పై భారత్ అరుదైన ఘనత..



Next Story

Most Viewed