ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బిగ్ అలర్ట్.. ఇవాళే దుబాయ్ వేదికగా కీలక ఘట్టం

by Disha Web Desk 2 |
ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బిగ్ అలర్ట్.. ఇవాళే దుబాయ్ వేదికగా కీలక ఘట్టం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చింది. ఇవాళ జరుగబోయే ఆ కీలక ఘట్టానికి దుబాయ్ వేదికగా కానుంది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఐపీఎల్ మినీ వేలం ప్రారంభం కానుంది. అదృష్టం పరీక్షించుకోవడానికి 333 మంది క్రీడాకారులు సిద్ధంగా ఉన్నారు. కాగా, ఐపీఎల్ చరిత్రలో తొలిసారి వేలం భారత్‌లో కాకుండా దుబాయ్‌లో జరుగబోతోంది. దీంతో క్రీడాకారులతో పాటు ఫ్యాన్స్‌ కూడా వేలం ప్రారంభం కోసం ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు. వేలంలో పాల్గొనే 333 మంది క్రీడాకారుల్లో భారత్‌కు చెందిన వారు 214 మంది ఉండటం గమనార్హం.

Next Story