ఆంధ్రా ప్రీమియర్ లీగ్ విజేత‌గా భీమవరం బుల్స్

by velandi.Saikiran |

ఆంధ్రా ప్రీమియర్ లీగ్ విజేతగా భీమవరం బుల్స్ జట్టు నిలిచింది.

ఆంధ్రా ప్రీమియర్ లీగ్ విజేత‌గా భీమవరం బుల్స్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆంధ్రా ప్రీమియర్ లీగ్ విజేతగా భీమవరం బుల్స్ జట్టు నిలిచింది. మంగళవారం మంగళగిరి స్టేడియం వేదికగా ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ జరిగింది. ఇందులో సింహాద్రి వైజాగ్ లయన్స్, భీమవరం బుల్స్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ ఫైనల్స్ లో అద్భుతంగా రాణించిన భీమవరం బుల్స్... ప్రత్యర్థి సింహాద్రి వైజాగ్ లయన్స్ పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వైజాగ్, 8 వికెట్ల న‌ష్టానికి 139 పరుగులు సాధించింది.

ఇక ఈ లక్ష్యాన్ని కేవలం 9 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది భీమవరం బుల్స్. దీంతో ఫైనల్స్ లో విజయం సాధించి ఛాంపియన్ గా నిలిచింది. ఇక ఈ మ్యాచ్ లో కెప్టెన్ హేమంత్ రెడ్డి 18 బంతుల్లో 52 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు బౌండరీలు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ రేవంత్, 19 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఫైనల్స్ ఏకపక్షంగా జరిగింది. ఫైనల్స్ లో విజయం సాధించిన భీమవరం జట్టుపై మంత్రి నారా లోకేష్ ప్రశంశల వర్షం కురిపించారు.

Next Story