ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం

by Ajay Maddhiboyina |   (  Updated:2025-09-14 03:12:34  IST  )

ప్ర‌పంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం దక్కింది. భారత్‌కు చెందిన బాక్సింగ్ క్రీడాకారిణి బైస్మిన్ లాంబోరియా లివర్‌పుల్‌లో మహిళల 57 కిలోల విభాగంలో స్వర్ణం సాధించింది.

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం
X

దిశ, వెబ్ డెస్క్: ప్ర‌పంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం దక్కింది. భారత్‌కు చెందిన బాక్సింగ్ క్రీడాకారిణి జాస్మిన్ లాంబోరియా లివర్‌పుల్‌లో మహిళల 57 కిలోల విభాగంలో స్వర్ణం సాధించింది. ఫైన‌ల్స్‌లో జాస్మిన్ పోలండ్‌కు చెందిన జూలియా సెరమెటాను ఓడించి విజయం సాధించింది. ఈ పోటీల్లో భారత్‌కు ఇదే మొదటి స్వర్ణం కాగా పురుష బాక్సర్లు సెమీ ఫైనల్స్ లోనే నిరాశపర్చారు.

మొదటి రౌండులో కాస్త వెనకబడిన తరవాత రౌండ్ లో మాత్రం జాస్మిన్ పుంజుకుంది. తరవాత అదే దూకుడు కొనసాగించింది. ఇదిలా ఉంటే జాస్మిన్ 2022 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించడంతో పాటు పారిస్ 2024 ఒలంపిక్స్ లో సైతం పాల్గొంది. 2025 మార్చిలో జరిగిన 8వ ఎలైట్ ఉమెన్స్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కూడా స్వర్ణం సాధించింది.

Next Story