ఇంగ్లాండ్ టూరుకు భారత జట్టు ఎంపికపై అప్‌డేట్.. ఆ రోజే జట్టు ప్రకటన

by Harish |
ఇంగ్లాండ్ టూరుకు భారత జట్టు ఎంపికపై అప్‌డేట్.. ఆ రోజే జట్టు ప్రకటన
X

దిశ, స్పోర్ట్స్ : వచ్చే నెలలో భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఈ టూరులో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టులు ఆడుతుంది. ఈ సిరీస్‌తోనే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సర్కిల్‌ను టీమిండియా ఆరంభించనుంది. ఇంగ్లాండ్ పర్యటనకు బీసీసీఐ ఈ నెల 23న భారత జట్టును ఎంపిక చేయనున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే త్వరలోనే సెలెక్టర్ల మీటింగ్ జరగనుంది. ఈ సమావేశం కీలకం కానుంది. రోహిత్ శర్మ టెస్టు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. జట్టు ఎంపికతోపాటు కొత్త టెస్టు సారథిని కూడా నియమించాల్సి ఉంది. ఈ నెల 20నే జట్టును ప్రకటిస్తామని బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా వెల్లడించినా రోహిత్ వీడ్కోలుతో ప్రణాళికల్లో మార్పులు జరిగినట్టు అర్థమవుతున్నది. శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ కెప్టెన్సీ రేసులో ఉన్నారు.




Next Story

Most Viewed