బీసీసీఐ ఛైర్మన్ తో సెహ్వాగ్ భార్య సీక్రెట్ రిలేషన్‌?

by velandi.Saikiran |   (  Updated:2025-10-09 17:24:29  IST  )

చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏకంగా

బీసీసీఐ ఛైర్మన్ తో సెహ్వాగ్ భార్య సీక్రెట్ రిలేషన్‌?
X

దిశ‌, వెబ్ డెస్క్ : టీమిండియా మాజీ డేంజ‌ర్ ఓపెన‌ర్‌ వీరేంద్ర సెహ్వాగ్ కు అతని భార్య ఆర్తి అహ్లవత్ వెన్నుపోటు పొడిచినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏకంగా వీరేంద్ర సెహ్వాగ్ స్నేహితుడితో సీక్రెట్ రిలేషన్షిప్ పెట్టుకుందట ఆర్తి. ఈ కారణంగానే గత సంవత్సరం తన భార్యకు విడాకులు ఇవ్వాలని వీరేంద్ర సెహ్వాగ్ నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి.

ఇంతకీ వీరేంద్ర సెహ్వాగ్ స్నేహితుడు ఎవరో కాదు, కొత్తగా వచ్చిన బీసీసీఐ పాలకమండలి ప్రెసిడెంట్ మిథున్. వీరేంద్ర సెహ్వాగ్, బీసీసీఐ కొత్త చీఫ్‌ మిథున్ మన్హాస్ ఇద్దరు ఒకప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ అని సమాచారం. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగారట. అయితే, వీరేంద్ర సెహ్వాగ్ లేని సమయంలో ఆయన ఇంటికి వెళ్లి, ఆర్తికి దగ్గరయ్యారట మిథున్. ఇలా దాదాపు కొన్ని సంవత్సరాలుగా క‌థ‌ నడిపిస్తున్నారట. ఈ విషయం గత సంవత్సరం వీరేంద్ర సెహ్వాగ్ కు తెలిసినట్లు తెలుస్తోంది. అందుకే కిందటి ఏడాది సెహ్వాగ్ తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందులో ఎంత మేర‌కు వాస్త‌వం ఉందో తెలియాల్సి ఉంది. కాగా వీరేంద్ర సెహ్వాగ్ కు ఇద్ద‌రు కుర్రాళ్లు ఉన్నారు.

Next Story