Rishabh Pant : రిషబ్ పంత్ రీ ఎంట్రీపై బీసీసీఐ కీలక ప్రకటన

by Sathputhe Rajesh |   (  Updated:2024-03-12 07:17:18  IST  )

టీమిండియా క్రికెటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీ ఎంట్రీపై బీసీసీఐ మంగళవారం కీలక ప్రకటన చేసింది.

Rishabh Pant : రిషబ్ పంత్ రీ ఎంట్రీపై బీసీసీఐ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా క్రికెటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీ ఎంట్రీపై బీసీసీఐ మంగళవారం కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 30, 2022లో జరిగిన ఘోర ప్రమాదం అనంతరం 14 నెలల రిహబిలిటేషన్, రికవరీ ప్రాసెస్ తర్వాత రిషబ్ పంత్ ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించింది. వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌గా టాటా ఐపీఎల్ 2024లో రిషబ్ పంత్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు అఫిషీయల్ ట్విట్టర్ అకౌంట్ వేదికగా ప్రకటన చేసింది. అయితే రిషబ్ పంత్ ఉత్తరఖండ్‌కు ఢిల్లీ నుంచి వస్తున్న సమయంలో రూర్కీ సమీపంలోని నర్సన్ సరిహద్దు వద్ద కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన పంత్ అప్పటి నుంచి అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు దూరంగా ఉంటున్నారు. తాజాగా బీసీసీఐ చేసిన ప్రకటనతో రిషబ్ పంత్ ఫ్యాన్స్, క్రికెట్ లవర్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Next Story