ఆసియా కప్‌కు టీమ్ ఇండియా జట్టు ప్రకటన..

by Disha Web Desk 13 |
ఆసియా కప్‌కు టీమ్ ఇండియా జట్టు ప్రకటన..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియా కప్- 2023కు భారత-ఏ జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. ఈ మెగా ఈవెంట్‌ హాంకాంగ్‌ వేదికగా జరగనున్నది. 14 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. ఈ జట్టుకు అండర్‌-19 స్టార్ క్రికెటర్‌ శ్వేతా సెహ్రావత్ నాయకత్వం వహించనుంది. అదే విధంగా ఈ జట్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ క్రికెటర్లు గొంగడి త్రిషా, బారెడ్డి మల్లి అనూషకు చోటు దక్కింది.

తెలంగాణకు చెందిన యువ సంచలనం గొంగడి త్రిషా ఇప్పటికే భారత అండర్‌-19 జట్టు తరఫున ఆడిన విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ జూన్‌-12 నుంచి షురూ కానుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు భాగం కానున్నాయి. ఇందులో భారత జట్టు గ్రూపు-ఏలో ఉండగా.. ఇందులో మిగిలిన జట్లు హాంకాంగ్, థాయిలాండ్ ‘ఎ’, పాకిస్తాన్ ‘ఎ’ వంటి జట్లు ఉన్నాయి. జూన్‌ 13న క్వాంగ్ రోడ్ రిక్రియేషన్ గ్రౌండ్‌ వేదికగా భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌తో తలపడనుంది. పాకిస్తాన్‌-ఏ జట్టుతో జూన్‌ 17న భారత్‌ ఆడనుంది.

భారత్ 'ఎ' (ఎమర్జింగ్) జట్టు:

శ్వేతా సెహ్రావత్ (కెప్టెన్), సౌమ్య తివారీ (వైస్ కెప్టెన్), త్రిష గొంగడి, ముస్కాన్ మాలిక్, శ్రేయాంక పాటిల్, కనికా అహుజా, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), మమత మడివాలా (వికెట్ కీపర్), టిటా యశశ్రీ ఎస్, కష్వీ గౌతమ్, పార్షవి చోప్రా, మన్నత్ కశ్యప్, బి అనూష.



Next Story

Most Viewed