విశ్వవిజేతగా భారత మహిళల క్రికెట్ జట్టు.. భారీ నజరానా ప్రకటించిన BCCI

by Kema Shiva Kumar |

వన్డే ఉమెన్స్ వరల్డ్ కప్‌లో భాగంగా ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ పోరులో భారత మహిళల క్రికెట్ జట్టు 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

విశ్వవిజేతగా భారత మహిళల క్రికెట్ జట్టు.. భారీ నజరానా ప్రకటించిన BCCI
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే ఉమెన్స్ వరల్డ్ కప్‌లో భాగంగా ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ పోరులో భారత మహిళల క్రికెట్ జట్టు 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్‌ప్రీత్ సేన 50 ఓవర్లలో 298/7 పరుగులు చేసింది. షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58) చెలరేగారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అవ్వడంతో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ క్రమంలోనే బీసీసీఐ భారత మహిళల క్రికెట్ జట్టుకు భారీ నజరానా ప్రకటించింది. ఈ మేరకు జట్టు మొత్తానికి రూ.51 కోట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధికారికంగా వెల్లడించాడు.

Next Story