బుమ్రా రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన అక్షర్ పటేల్..

by Disha Web Desk 13 |
బుమ్రా రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన అక్షర్ పటేల్..
X

దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో ఇండియా తరఫున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. భారత్‌కు చెందిన పేసర్ బుమ్రా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అదే విధంగా అశ్విన్ పేరిట ఉన్న రికార్డును వెనక్కి నెట్టాడు. ఆసీస్‌తో జరుగుతున్న 4 వ టెస్టు అఖరి రోజు సందర్భంగా ఈ ఘనతను సాధించాడు. ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను బౌల్డ్ చేయడంతో .. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో 50 వికెట్ల తీసిన క్రికెటర్‌గా నిలిచాడు. అత్యంత తక్కువ బంతుల్లో టెస్టుల్లో 50 వికెట్ల ఘనతను సాధించి.. బుమ్రా రికార్డును బద్దలు కొట్టాడు.

టెస్టుల్లో టీమ్ ఇండియా తరఫున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారత బౌలర్లు..

అక్షర్ పటేల్ 2,205 బంతుల్లో

బుమ్రా 2,465 బంతుల్లో

అశ్విన్ 2,597 బంతుల్లో

Next Story

Most Viewed