అహ్మదాబాద్‌లో చివరి టెస్టు.. లంచ్ తర్వాత సెషన్‌లో ఆసీస్ స్కోర్ ఎంతంటే?

by Disha Web Desk 13 |
అహ్మదాబాద్‌లో చివరి టెస్టు.. లంచ్ తర్వాత సెషన్‌లో ఆసీస్ స్కోర్ ఎంతంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్‌లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టెస్టులో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. లంచ్ తర్వాత సెషన్‌లో ఆసీస్ మరో రెండు వికెట్లు కోల్పోయింది. టీమ్ ఇండియా బౌలర్లలో షమీ రెండు వికెట్లు తీయగా.. అశ్విన్ 1, జడేజా 1 వికెట్ పడగొట్టారు. ఆసీస్ 170 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకుంది. ట్రావిస్ హెడ్ 32 పరుగులు చేయగా.. మూడో టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మార్నస్ లబుషేన్ 3 పరుగులకే వెనుదిరిగాడు. తాత్కాలిక సారథి స్టీవెన్ స్మిత్ 38 పరుగులు చేశాడు. పీటర్ హ్యాండ్స్ కోంబ్ 17 పరుగులు చేసి అవుటయ్యాడు. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ స్కోరు 83 ఓవర్లలో 4 వికెట్లకు 220 పరుగులు కాగా.. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 94, కామెరాన్ గ్రీన్ 26 రన్స్‌తో క్రీజులో ఉన్నారు.


Next Story

Most Viewed