డబ్ల్యూటీసీ ఫైనల్‌‌కు హాజెల్‌వుడ్ దూరం

by Dishafeatures2 |
డబ్ల్యూటీసీ ఫైనల్‌‌కు హాజెల్‌వుడ్ దూరం
X

సిడ్నీ : టీమ్ ఇండియాతో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆసిస్ స్టార్ పేసర్ జోష్ హాజెల్‌వుడ్ గాయం కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్‌లో బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతను.. లీగ్‌లో గాయపడి మధ్యలోనే స్వదేశానికి వచ్చేశాడు. అయితే, గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతను ఫైనల్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. హాజెల్‌వుడ్ స్థానంలో క్రికెట్ ఆస్ట్రేలియా మరో పేసర్ మైఖేల్ నెసెర్‌ను జట్టులోకి తీసుకుంది. కాగా, లండన్‌లోని ఓవల్ వేదికగా ఈ నెల 7 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభకానుంది.


Next Story

Most Viewed