Neeraj Chopra: ప్రధాని మోడీని కలిసిన అథ్లెట్ నీరజ్ చోప్రా దంపతులు

by Ramesh Naini |   (  Updated:2025-12-23 13:10:41  IST  )

ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన భార్య హిమాని మోర్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని మంగళవారం కలిశారు.

Neeraj Chopra: ప్రధాని మోడీని కలిసిన అథ్లెట్ నీరజ్ చోప్రా దంపతులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన భార్య హిమాని మోర్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని మంగళవారం కలిశారు. ఢిల్లీలో ప్రధాని నివాసంలో వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్రీడలతో పాటు పలు అంశాలపై సానుకూలంగా చర్చ జరిగినట్లు ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో వెల్లడించారు. ‘ఈ రోజు నీరజ్ చోప్రా, ఆయన భార్య హిమాని మోర్‌ను కలిశాను. క్రీడలు సహా వివిధ అంశాలపై మంచి చర్చ జరిగింది’ అని ప్రధాని పేర్కొన్నారు. భారత క్రీడలకు నీరజ్ చోప్రా చేసిన సేవలను ప్రధాని అభినందించగా, భవిష్యత్‌లో దేశానికి మరిన్ని ఘన విజయాలు అందించాలని ఆకాంక్షించారు. కాగా, ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story