Asian Games -2023 : అర్చరీలో భారత జట్టుకు స్వర్ణం...

by Disha Web Desk 1 |
Asian Games -2023 : అర్చరీలో భారత జట్టుకు స్వర్ణం...
X

దిశ, వెబ్ డెస్క్ : ఆసియా క్రీడల్లో మరో సంచలనం నమోదైంది. కాంపౌండ్ మిక్స్‌డ్ టీం ఈవెంట్ లో జ్యోతి సురేఖ వెన్నం, ఓజాస్ డియోటలే సర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఫైనల్‌లో వీరిద్దరూ సౌత్ కొరియా జట్టును 159-158 తేడాతో మట్టికరింపించారు. అదేవిధంగా 35 కి.మీ. మిక్స్‌డ్ నడక ఈవెంట్‌లో భారత్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. దీంతో పతాకాల పట్టికలో భారత్ మెడల్స్ సంఖ్య 71కి చేరింది. ఇప్పటి వరకు ఇండియా ఇన్ని మెడల్స్ సాధించడం ఇదే మొదటి సారి. చివరి సారిగా 2018 ఆసియా క్రీడల్లో భారత్ 70 పతకాలను గెలుచుకుంది.



Next Story

Most Viewed