భారత క్రికెట్ జట్టుకు షాక్.. మొదటి రెండు మ్యాచులకు స్టార్ ప్లేయర్ దూరం

by Disha Web Desk 12 |
భారత క్రికెట్ జట్టుకు షాక్.. మొదటి రెండు మ్యాచులకు స్టార్ ప్లేయర్ దూరం
X

దిశ, వెబ్‌డెస్క్: 2023 ఆసియా కప్ రేపటి నుంచి పాకిస్తాన్ వేదికగా జరుగనుంది. ఈ క్రమంలో భారత్ కు భారీ షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇటీవల గాయం నుంచి కోలుకున్నాడు. కానీ ఇటీవల ఆసియా కప్ కోసం శ్రీలంకకు చేరుకున్న జట్టుతో రాహుల్ వెళ్లలేదు. గాయం నుంచి కోలుకున్నప్పటికి అతను 100 శాతం ఫిట్ గా లేనట్లు తెలుస్తుంది. దీంతో అతను మరో వారం తర్వాత ఆసియా కప్ జట్టు లో చేరనున్నాడు. అంటే మొదటి రెండు మ్యాచులకు రాహుల్ దూరం కానున్నాడు. అలాగే మరో రెండు రోజులు వరల్డ్ కప్ కు భారత జట్టును కూడా ప్రకటించనున్నారు. మరి ఆ తుది జట్టులో రాహుల్ కు స్థానం దక్కుతుందో లేదో చూడాలి మరి.

Next Story