జ్వరంలోనూ సెంచరీ.. విరాట్ కోహ్లీపై అనుష్క పోస్ట్ వైరల్..

by Disha Web Desk 13 |
జ్వరంలోనూ సెంచరీ.. విరాట్ కోహ్లీపై అనుష్క పోస్ట్ వైరల్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో విరాట్ టెస్టుల్లో 28వ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. కోహ్లిపై అనుష్క చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. జ్వరంలోనూ సెంచరీ బాదాడు అంటూ అనుష్క చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. టెస్టు క్రికెట్ లో 1,205 రోజుల తర్వాత విరాట్ కోహ్లి సెంచరీ బాదాడు. ఈ సెంచరీ అతనికే కాదు అభిమానులకు కూడా ఎంతో ప్రత్యేకం. ఆస్ట్రేలియాపై కోహ్లీకి ఇదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు. అతడు 186 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన తర్వాత అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తూ.. "జ్వరంలోనూ ఇంత సహనంతో ఆడటం. నన్నెప్పుడూ ఇన్‌స్పైర్ చేస్తూనే ఉంటావ్" అంటూ కోహ్లి ఫొటోను షేర్ చేసింది.

నాలుగు మ్యాచ్‌లలో కలిపి అతడు 49.5 సగటుతో 297 రన్స్ చేశాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్ లో విరాట్ కు ఇది 75వ సెంచరీ. స్వదేశంలో టెస్టుల్లో అతనికిది 14వ సెంచరీ. స్వదేశంలో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన వారిలో అజారుద్దీన్, సెహ్వాగ్, దిలీప్ వెంగ్‌సర్కార్ లాంటి వాళ్లను కోహ్లీ వెనక్కి నెట్టాడు.

Next Story