దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో.. ఆండీ ముర్రేకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ

by Disha Web Desk 13 |
దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో.. ఆండీ ముర్రేకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగనున్న దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో బ్రిటీష్ టెన్నిస్ లెజెండ్ ప్లేయర్ ఆండీ ముర్రే పాల్గొననున్నాడు. అతనికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ దొరికింది. ముర్రేకు నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఇవ్వడం వరుసగా ఇది రెండోసారి. దుబాయ్ టెన్నిస్ టోర్నీ ఈ నెల 26 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు జరుగుతుంది. వరుసగా మూడోసారి ముర్రే దుబాయ్ టోర్నీలో పాల్గొనబోతున్నాడు. స్కాట్లాండ్‌కు చెందిన ముర్రే 2016లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్‌ను సాధించాడు. అంతేకాకుండా రెండుసార్లు దుబాయ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన ముర్రే 2017లో టైటిల్ గెలిచాడు. ఫైనల్‌లో ఫెర్నాండో వెర్డాస్కోను ఓడించాడు. ఆ తర్వాత ముర్రే ర్యాంక్ పడిపోయింది.

Next Story