స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలో సెమీస్‌కు అమిత్, సచిన్

by Dishanational3 |
స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలో సెమీస్‌కు అమిత్, సచిన్
X

దిశ, స్పోర్ట్స్ : బల్గేరియాలో జరుగుతున్న స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలో భారత స్టార్ బాక్సర్, కామెన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ అమిత్ పంఘల్ సెమీస్‌కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 51 కేజీల విభాగంలో అమిత్ 5-0 తేడాతో మంగోలియాకు చెందిన బత్తుల్గా‌ను చిత్తు చేశాడు. మొదటి నుంచి బౌట్‌లో దూకుడుగా కనిపించిన అమిత్ ఏ దశలోనూ ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. మంగోలియా బాక్సర్‌పై పంచుల దాడికి బౌట్‌ను ఏకపక్షంగా గెలుచుకున్నాడు. మరో బాక్సర్ సచిన్ 57 కేజీల కేటగిరీలో సెమీస్‌కు అర్హత సాధించాడు. క్వార్టర్స్‌ బౌట్‌లో సచిన్ 5-0 తేడాతో జార్జియాకు చెందిన కపనాడ్జే జార్జిపై గెలుపొందాడు. సెమీస్‌లో అతను ఉక్రెయిన్‌ బాక్సర్ అబ్దురైమోన్ ఐడర్‌తో తలపడనున్నాడు. 67 కేజీల కేటగిరీలో రజత్ కూడా సెమీస్‌కు చేరుకోగా.. 54 కేజీల కేటగిరీలో లలిత్ క్వార్టర్స్‌లో ఓడిపోయాడు.



Next Story