ఒకే ఓవర్‌లో 24 పరుగులు.. యూపీ సూపర్ విక్టరీ

by Disha Web Desk 12 |
ఒకే ఓవర్‌లో 24 పరుగులు.. యూపీ సూపర్ విక్టరీ
X

దిశ, వెబ్‌డెస్క్: WPL 2023 మూడో మ్యాచ్ యూపీ, గుజరాత్ జట్ల మధ్య నేవి ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో యూపీ జట్టు చివరి ఓవర్లో 24 పరుగుల చేసి స్టన్నింగ్ విక్టరి నమోదు చేసుకుంది. కాగా ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బ్యాటింగ్ చేసి.. 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి.. 169 పరుగులు చేసింది. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన యూపీ జట్టు 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. దీంతో యూపీ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముఖ్యంగా యూపీ వారియర్స్ జట్టు చివరి ఓవర్లో 19 పరుగులు కావాల్సి ఉండగా 5 బంతులు 25 పరుగు చేసి విక్టరి సాధించారు. కాగా ఈ సీజన్ వరుసగా రెండోసారి గుజరాత్ జట్టు ఓటమి పాలైంది.

Advertisement
Next Story

Most Viewed