నాగపూర్ టెస్టులో నిరాశపరిచిన తెలుగు తేజం.. రీ ఎంట్రీలో ఇరగదీస్తున్న జడేజా..

by Disha Web Desk 13 |
నాగపూర్ టెస్టులో నిరాశపరిచిన తెలుగు తేజం.. రీ ఎంట్రీలో ఇరగదీస్తున్న జడేజా..
X

దిశ, వెబ్‌డెస్క్: నాగపూర్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతోన్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకే కుప్పకూల్చిన టీమిండియా.. ప్రస్తుతం కీలక ఆధిక్యంలో దూసుకుపోతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ప్రస్తుతం 110 ఓవర్లలో 7 వికెట్లకు 312 పరుగులు చేసింది. భారత్ 135 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే, ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన తెలుగు తేజం కేఎస్ భరత్ స్వల్ప స్కోరుకే ఔట్ అయి నిరాశ పరిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ అవుట్ కావడంతో బరిలో దిగిన భరత్ 10 బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులే చేశాడు. ఆస్ట్రేలియా యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ బౌలింగ్‌లో భరత్ ఎల్బీడబ్ల్యూగా ఏడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా 61, అక్షర్ పటేల్ 50 పరుగులతో ఆడుతున్నారు. నిన్న బౌలింగ్‌లో ఐదు వికెట్లతో ఆకట్టుకున్న జడేజా.. బ్యాటింగ్‌లోను ( 61 ) తో నాటౌట్‌గా రెచ్చిపోయాడు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story