- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధాన్యం సేకరణలో తెలంగాణ టాప్
by Shyam |
<p>దిశ, న్యూస్బ్యూరో: వరి ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని ఎఫ్సీఐ సీఎండీ డీవీ ప్రసాద్ ఢిల్లీలో వెల్లడించారు. జాతీయ స్థాయిలో 83.01 లక్షల టన్నులు సేకరించామని, తెలంగాణ నుంచి 52.23 లక్షల టన్నులు వచ్చిందన్నారు. కొవిడ్ -19 కారణంగా సవాళ్లను ఎదుర్కొని ధాన్యం సేకరణలో రికార్డు సాధించామన్నారు. దేశంలో నెంబర్వన్గా తెలంగాణ ఉందన్నారు. గోదుమల సేకరణలో పంజాబ్ రాష్ట్రం ముందున్నట్లు ఆయన తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనా ద్వారా […]</p>
దిశ, న్యూస్బ్యూరో: వరి ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని ఎఫ్సీఐ సీఎండీ డీవీ ప్రసాద్ ఢిల్లీలో వెల్లడించారు. జాతీయ స్థాయిలో 83.01 లక్షల టన్నులు సేకరించామని, తెలంగాణ నుంచి 52.23 లక్షల టన్నులు వచ్చిందన్నారు. కొవిడ్ -19 కారణంగా సవాళ్లను ఎదుర్కొని ధాన్యం సేకరణలో రికార్డు సాధించామన్నారు. దేశంలో నెంబర్వన్గా తెలంగాణ ఉందన్నారు. గోదుమల సేకరణలో పంజాబ్ రాష్ట్రం ముందున్నట్లు ఆయన తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనా ద్వారా నిరుపేదలకు ఆహార ధాన్యాలు అందించామన్నారు. అదే విధంగా ఎఫ్సీఐ నుంచి తెలంగాణలో 88లక్షల మందికి సబ్సిడీతో 1.32 లక్షల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లకు ఎఫ్సీఐ సిద్ధంగా ఉంటుందని డీవీ ప్రసాద్ పేర్కొన్నారు.
Next Story






