బైక్‌ను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి

by  |
బైక్‌ను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : బీహార్ రాజధాని పాట్నాలో ఘోర ప్రమాదం జరిగింది. కంకర్‌బాగ్ ప్రాంతంలోని ఎన్‌హెచ్-30 రహదారిపై వేగంగా వస్తున్న ఓ లారీ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటన స్థలంలోనే ఇద్దరు మృతి చెందారు. లారీ బైకును ఢీకొట్టిన వెంటనే లారీలో మంటలు వ్యాపించాయి. వేంటనే ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపుచేశారు.

ప్రమాదం జరిగిన అనంతరం లారీ డ్రైవర్ ఘటన స్థలంలో నుంచి పారిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. హింసాత్మక గుంపు ట్రక్కును నిప్పంటించింది.


Next Story

Most Viewed