- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నిర్మల్: దీపావళి పండుగ రోజు ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. దైవదర్శనానికి వెళ్తుండగా ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి కారు వేగంగా ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ రూరల్ మండలంలోని తల్వేద గ్రామానికి చెందిన తోకల సిద్దేష్ (38) అతని భార్య తోకల ముత్తవ్వ (33)లు ద్విచక్ర వాహనంపై నర్సాపూర్ (జి) మండలంలోని డొంగుర్ గాం గ్రామంలోని సిద్దేశ్వరుని దర్శనానికి బయలుదేరారు.
దిలావర్ పూర్ గ్రామ సమీపంలోకి రాగానే ద్విచక్ర వాహనాన్ని వేగంగా వస్తున్న కారు వెనక నుండి ఢీ కొట్టింది. దీంతో ముత్తవ్వ అక్కడికక్కడే మృతి చెందగా, సిద్దేష్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్టలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలికి ఇద్దరు కూతుళ్లున్నారు.
Next Story