తెలంగాణలో యుముడికి ప్రత్యేక పూజలు.. ఎక్కడో తెలుసా.?

by  |
తెలంగాణలో యుముడికి ప్రత్యేక పూజలు.. ఎక్కడో తెలుసా.?
X

దిశ, ధర్మపురి : ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి క్షేత్రంలో వెలసిన శ్రీ యమధర్మ రాజుకు శనివారం.. స్వామివారి జన్మ నక్షత్రం భరణి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఉదయం స్వామి వారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుసూక్తం, యమసూక్తంతో అభిషేకం చేసి హారతి, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ, సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, అర్చకులు సముద్రాల వంశీ కృష్ణ, వొద్దిపర్తి కళ్యాణ్, ప్రదీప్ కుమార్, అభిషేకం పురోహితులు బొజ్జ సంపత్ కుమార్, బొజ్జ సంతోష్ కుమార్, భక్తులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed