కరోనా బాధితులకు స్పెషల్ ఐసోలేషన్​ సెంటర్లు

by  |
Special Isolation Centers
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్​పరిధిలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారుల్లో కదలిక కనిపిస్తోంది. కరోనా కట్టడి, లాక్​డౌన్, పాజిటివ్​ కేసులకు సేవలు వంటి అంశాలపై మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్​సెక్రటరీ అర్వింద్​కుమార్​బుధవారం వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐసోలేషన్​సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

గ్రేటర్ పరిధిలోని ఫంక్లన్​హాల్స్, ప్రభుత్వ పాఠశాలల డేటాను అధికారులు సేకరిస్తున్నారు. ఇండ్లలో ఐసోలేషన్​ఉండేందుకు అవకాశం లేని పేదల కోసం వీటిని ఉపయోగించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించాయి. దీంతో వచ్చే నెలలో తెలంగాణలో కూడా లాక్ డౌన్ విధిస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. నగరంలోనూ రాత్రి పూట కర్ఫ్యూ స్థానంలో పూర్తిగా లాక్‌డౌన్ విధించే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు లాక్​డౌన్​చర్యలను చేపడుతున్నారు.

కరోనా కట్టడి కోసం కర్ఫ్యూ విధించినప్పటికీ అనుకున్న ఫలితాలు రాకపోవడంతో ప్రభుత్వం దశల వారీగా లాక్‌డౌన్ విధించే దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్ పరిధిలోని నిరాశ్రయులు, బిచ్చగాళ్లను నైట్ షెల్టర్లకు తరలించే ప్రక్రియను జీహెచ్ఎంసీ చేపట్టింది. గ్రేటర్‌లో లాక్‌డౌన్ విధించేందుకు ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా సిద్ధంగా ఉండేలా జీహెచ్ఎంసీ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. జీహెచ్ఎంసీ కమిషనర్​ లోకేష్​ కుమార్​ తో పాటు జోనల్​ కమిషనర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


Next Story

Most Viewed