మహబూబ్‌నగర్ జిల్లాకు వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి

by  |
మహబూబ్‌నగర్ జిల్లాకు వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి
X

దిశ, మహబూబ్‎నగర్: లాక్‌డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయి జిల్లాకు వస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను కలెక్టర్ ఎస్.వెంకట్రావు ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వస్తున్న వారి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. జిల్లాకు వచ్చిన వారికి వెంటనే పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. జిల్లా, మండల స్థాయిలో నోడల్ అధికారులను నియమిస్తున్నామని తెలిపారు. రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేసి కంట్రోల్ రూంకు అనుసంధానం చేస్తున్నట్టు కలెక్టర్ వెంకట్రావు తెలిపారు.

tag: collector Venkat rao, meeting, officials, mahabubnagar

Next Story