'వలస కూలీలపై ప్రత్యేక దృష్టి సారించాం'

by  |
వలస కూలీలపై ప్రత్యేక దృష్టి సారించాం
X

దిశ, మెదక్: సిద్ధిపేట జిల్లాకు వచ్చిన వలస కూలీల్లో దాదాపు 50 శాతం మందికి సంబంధించి 14 రోజుల క్వారంటైన్ వ్యవధి పూర్తయింది. ప్రస్తుతానికి ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు నిత్యం గృహనిర్బంధంలో ఉన్న వలస కూలీల వద్దకు వెళ్లి లక్షణాలు ఏమైనా ఉన్నాయా.. ? అని ఆరా తీస్తూ వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి జిల్లాకు భారీ సంఖ్యలో వలస కూలీలు వచ్చారు. ఈ క్రమంలో అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ అంశంపై కొవిడ్ -19 జిల్లా నోడల్ అధికారి డా.పవన్ కుమార్ మాట్లాడుతూ.. తొగుట ఘటన నేపథ్యంలో వలస కూలీలపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. వారి కుటుంబ సభ్యులను బయటకు రాకుండా కట్టడి చేస్తున్నామన్నారు.

Next Story

Most Viewed