ఏపీలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఆకస్మిక దాడులు

by  |
ఏపీలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఆకస్మిక దాడులు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఇటీవల శానిటైజర్లు తాగి పలువురు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఆకస్మిక దాడులు చేస్తోంది.

మెడికల్ షాపులు, శానిటైజర్ కంపెనీల్లో అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా, ప్రకాశం జిల్లా కురిచేడులో ఇటీవల శానిటైజర్ తాగి 10 మందికిపైగా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలకు శానిటైజర్లపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.


Next Story

Most Viewed