- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కొత్తగూడ: పశు సంరక్షణకై పశు వైద్య సంచార వాహనాన్ని కొత్తగూడ, గంగారం మండలాల పరిధిలో సేవలు అందించడం కోసం ప్రారంభించారు. ఇరు ఏజెన్సీ మండలాల్లోని పలు గ్రామాల్లో పశువులకు వ్యాధులు సంక్రమిస్తే, అందుబాటులో సరైన వైద్యం అందక ఎక్కువ సంఖ్యలో మృత్యువాత పడేవి. ఈ సంచార పశు వైద్య అంబులెన్స్ రాకతో ఆ కష్టాలు తీరనున్నాయి. 1962 నెంబర్కి కాల్ చేస్తే సంచార పశు వైద్య అంబులెన్స్ మీ వాకిట్లోకి వచ్చి వైద్యం అందిస్తుంది. రైతులకు సంచార పశువైద్యం వల్ల ఎంతో మేలు కలగనుంది. ఒక్క ఫోన్ కాల్తో సరిగ్గా మంద వద్దకు అంబులెన్స్ వెళ్లి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించనుంది. గ్రామాల నుంచి పశువులను తీసుకుని వైద్యశాలకు వెళ్లలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.1962 వాహనంలో అన్ని రకాల జంతువులకు ఉచితంగా సేవలు అందజేస్తారు. ఈ వాహనంలో డాక్టర్, వెటర్నరీ అసిస్టెంట్, కెప్టెన్, అటెండర్ అందుబాటులో ఉంటారు. ఈ కార్యక్రమంలో నెహ్రు నాయక్, శరణ్య, పాలడుగుల రవి తదితరులు పాల్గొన్నారు.