డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించిన స్పీకర్

by  |
డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించిన స్పీకర్
X

దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలకేంద్రంలో నూతనంగా నిర్మించిన 114 డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించి లబ్దిదారులతో గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ కులం, మతం, రాజకీయాలకు అతీతంగా నియోజకవ్గంలోని పేదవారికి సొంత ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. పేదింటి ఆడబిడ్డ ఆత్మగౌరవం కాపాడటానికే డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఇళ్ల సబ్సిడీలో సగం మాత్రమే మాఫీ ఉండేదని, కానీ నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం 100శాతం సబ్సిడీతో అన్ని వసతులతో రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి ఇస్తుందని పేర్కొన్నారు.

Next Story

Most Viewed