ఇలా జరుగుతాదని ఊహించలేదు: పోచారం

by  |
ఇలా జరుగుతాదని ఊహించలేదు: పోచారం
X

దిశ, దుబ్బాక: ఉద్యమ భావాలు ఉన్నగొప్ప నాయకుడు రామలింగారెడ్డిని కోల్పోవడం రాష్ట్ర ప్రజలకు తీరని లోటని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రామలింగారెడ్డి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కొద్ది రోజులకే మరణిస్తాడని కలలో కూడా అనుకోలేదన్నారు. శనివారం స్పీకర్ పోచారం చిట్టాపూర్ గ్రామంలోని దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రామలింగారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. రామలింగారెడ్డి హఠాన్మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. స్పీకర్ వెంట ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు.

Next Story