కేసీఆర్‌ను కలిసిన స్పీకర్ పోచారం.. విషయమేమిటంటే.?

by  |
Pocharam-Srinivas-Reddy-and
X

దిశ ప్రతినిధి, నిజమాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ప్రగతిభవన్‌లో సీఎంను కలిసి బాన్సువాడ నియోజకవర్గంలోని అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించడంతో పాటు నూతనంగా మరో ఐదువేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని మెట్ట ప్రాంత భూములకు నీరు అందించడానికి జాకోరా, చందూరు ఎత్తిపోతలు, సిద్దాపూర్ రిజర్వాయర్ మంజీర నదిపై చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసినందుకు కేసీఆర్‌కు పోచారం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed